Saturday 24 September 2016

ఉండ్రాళ్ళతద్దె నోము ఉద్యాపన.

సెప్టెంబర్ 19 న కొండా పుర్లో మా కోడలు రాజ్యలక్ష్మి   ఉండ్రాళ్ళ తద్దె నోము ఉద్యాపన చేసుకున్నది.
క్రితం రోజే ఐదుగురు ముత్తైదువలు  వచ్చారు.సాయంత్రం అందరికి రాజ్యలక్ష్మి గోరింటాకు పెట్టింది.భోజనాలు చేసి పడుకున్నారు.తెల్లవారుజామున లేచి నలుగు పెట్టుకుని తలంట్లు పోసుకున్నారు.అందరికి బాత్రూంలో నూనె సున్నిపిండి,షాంపూలు పెట్టింది.
వాళ్ళ స్నానాలు అయేసరికే రాజ్యలక్ష్మి పూజ అయింది.
ఆ ఐదుగురికి  గొంగూరపచ్చ డి ,,కంది పచ్చడి ,పొట్లకాయ పెరుగుపచ్చడి వేసి అన్నం పెట్టింది.సూర్యోదయం కాకమునుపే తినేయ్యాలి.
ఆ తర్వాతా అందర్నీ ఉయ్యలలూపింది.,దాంతో పార్ట్-1 అయింది.
మళ్ళీతను వాళ్ళమ్మ స్నాన్నలు చేసి మడి తో వంట  చేసారు.పిల్లలకి పరిక్షలు.వాళ్ళని తాయారు చేసి బాక్స్ లు కట్టి బళ్ళో దించి వచ్చింది.
ఐదుగురు ముత్తైదువులు మల్లి స్నానం చేసి,లలితాసహస్రం చదివారు.
రాజ్యలక్ష్మి పునః పూజ చేసి,కధ చదివి, మహా నైవేద్యం పెట్టింది.
ఆ ఐదుగురు ముత్తైడువులకి సుమంగళి పూజ చేసింది.పూర్ణం బూరెల వాయనం ఇచ్చింది .
కాళ్ళకి పసుపు రాసి,బట్టు పెట్టి గంధంరాసింది.
వాళ్లకి చీరలు పెట్టి,ఆశీస్సులు తీసుకుంది.
అందరికి పంచభక్ష,పరావాన్నాలతో భోజనం పెట్టింది.తాంబూలం వేసుకుని కబుర్లు చెప్పుకుని,ఆనందోత్సాహాలతో,ఆమెని వేనోళ్ళ కొనియాడుతూ,ఆశీస్సులన్దిస్తూ,
అందరూ,సెలవ తీసుకున్నారు.

Thursday 1 October 2015

స్వేచ్ఛా విహంగం

       


           సత్యన్వేషనకై తరలిన  శ్వాస
           విశ్వమంతా  నిండిన  ప్రానవాయువుని కలిసి
ప్రవాసానంతరం తన వారిని కలిసిన
ఆనందానుభూతి  పొందింది  కాబోలు,
పాత్రానుగత ప్రారభ్డ మనుభవించి ,
ప్రాకృతాల కర్మ ఫలానుభూతి చెంది,
ప్రలోభాల పద్మవ్యుహాల చిక్కి,
అనుబంధాల పాశాల బంధింపబడి,
బాధ్యతల బంగారు బంధాల బిగిసి,
పడుగు పేకలైన పాప పుణ్యాల వలలో చిక్కి,,
అతి ప్రయాసతో బంధవిముక్తయై,,
స్వేచ్ఛావిహంగమై,,,
సత్యాన్వేషణ కై  తరలింది శ్వాస!!!!!!!!

Tuesday 30 June 2015

జీవనశిల్పి...

జీవనశిల్పి
నీతలపు, మండుటెడారిలో మధుర ఫలతరువై,
నీపిలుపు,హృదయవీణ తంత్రులు మీటిన దివ్య ఓంకార నాదమై,
నీ చూపు,అనురాగ ఝల్లులు కురిపించు అమ్మయై,
నీ శిక్షణ, జ్ఞానాంబుధిని చిలకమన్న కవ్వమై,
నీ సందేశం, సంసారసాగరాన్ని దాటించి,
సుదూర తీరాల్ని చేర్చు చుక్కానియై,అ
నన్ను తీర్చిదిద్దిన నాన్నా,,
భవిష్యత్తు చిటికెన వేలూని నిను వీడివెల్తున్నవేళ,
జీవనప్రవాహ ప్రస్తానంలో నావనై తరలినవేళ,
నీ అప్యాయతకిదూరమౌతున్నానని విలవిల్లాడాను,
కానీ నాన్నా,,
నాల్గు వేదాల సంపుటి అయి ,,నీ నాల్గు వేళ్ళు అద్దిన చోట,
ఇక కన్నీటి జాడ లేదు,
బ్రతుకు బెదిరించిన వేళా,,ఆపదలు అలముకున్న వేళా,,
వెన్ను తట్టి నిలబెట్టింది నీ తలపే.
బేలతనం నాకెదురైన వేళ,నీ తలపు ఖడ్గమై కదను తొక్కుతోంది.
నీ ఓదార్పు  గురూపదేశ లేపనమై,
ఎదకు తాకిన గాయాల్ని మాన్పింది.
పాలు,నీళ్ళు,వేరు చేసే హంసలా నన్ను తీర్చిదిద్దిన పంచశీలమూర్తివి,
నీ ఆశీర్వాదాన్ని,నా రక్షణ కవచంగా ధరించి,గమ్యం వైపు పయనిస్తున్నా,,,,,!!!!!!!!!


Monday 25 May 2015

కిం కర్తవ్యం

కిం కర్తవ్యం,,,,?


స్వార్ధం చెలియలికట్ట దాటి,సమాజాన్ని ముంచేస్తున్న వేళ,
కత్తిసాములతో,గొడ్డళ్ళ విన్యాసాలతో,క్రౌర్యం విలయతాండవం చేస్తున్నవేల,
స్త్రీలు,వృద్దులు,పిల్లలని కూడా చూడక,చిత్రహింసల పాల్చేస్తున్నవేల,
మంచితనం,మానవత్వం,మరుగునపడి,
మాయమాటలు,మోసపుచేతలతో,
గోటితో పోయేదాన్ని గొడ్డలితో నరుకుతూ,జీవనపరమావధి మరచిపోతున్నవేల,
అమానుశశక్తులు అకస్మాత్తుగా
రక్తదాహం,నరమేధం,కోరుతున్నవేల,
ఎక్కుతున్న మెట్లకి పాకుడుపట్టి,
అధఃపాతాళానికిజారుతున్నవేల,
మానవుడే దానవుడిగా రూపాంతరం చెంది,
లోక దహన కాండకు ఆయుత్తమైనవేల,,
యంత్రాలకూ,మంత్రాలకూ ప్రాధాన్యమిస్తూ,
సాటిమనిషి మనసుని,నిర్లక్ష్యం చేస్తున్నవేల,,
ఎవడోవచ్చి రక్షిస్తాడని ఎదురుచూస్తూ,,,,
కాపాడే వారే కాటేస్తారనే భీతితో ,,
మతమౌద్యాలకిది మరో రూపమనీ,,
రాజకీయచదరంగంలోనశించే పావులమనీ,
నిరాశా,నిస్పృహలకు  లోనయ్యే సమయం కాదిది,
స్వార్ధపు పునాది పడకుండా చూసే ముందుచూపు,,
వ్యామోహపు కలుపు మొక్కల్ని ఎరిపారేసే నేర్పు,
దుండగుల నెదిరించే ధైర్యం,కిరాతకాన్ని రూపుమాపే శౌర్యం కావాలి నేడు,
ప్రతి యువతా ఒక అభేద్య దుర్గమై,ప్రతి హస్తం దుర్మార్గాన్ని,దునుమాడే ఖడ్గమై,
కర్తవ్యదీక్షా పరతంత్రులమై నిలవాలి నేడు,
బద్ధకాలు,ప్రలోభాలువీడి,ఆత్మసంరక్షనార్ధం,,
లోకకళ్యానార్ధం,దీక్షాకంకన బదులమై,నిలవాలినేడు,,
రంగులవెంట పరుగులిడకుండా,
మనిషి మృగంకాకుండా,దైవత్వం పెంచుకునే దీక్ష పూనాలి నేడు.!!

Thursday 14 May 2015

ప్రయాణం

ప్రయాణం
 అమ్మ అమృత గర్భంనుండి.
అంతిమ సత్యమైన నిన్ను చేరే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ,,,
ఎదురయ్యేవెన్నిముళ్ళ దారులో,
సేదతీర్చే వెన్ని పూలతోటలో,..
ఎదవెలిగించే వెన్ని అనురాగాదీపాలో,
కళ్ళు తెరిపించేవెన్ని జ్ఞాన జ్యోతులో ,
అధివహించాల్సిన విజ్ఞాన శిఖరాలెన్నో,
అధః పాతాళానికి చేర్చే అరిషడవర్గాలెన్నో,
తెలిసీతెలియని వయసులో విలువలు తెలియక,
వృధా అయిన పుణ్య కాలాలెన్నో,!
స్వార్ధం రూపాంతరాలు చెంది,
సోమరితనం,వ్యామోహంగా,
కన్నులకు పొరలు గమ్మి,మయసభలో నడిపించిన
మాయ మజిలీలెన్నో,,!!!
ప్రకృతిని  పరిశీలించే ఓర్పు లేక ,నియమబధంగా నడిచే నేర్పులేక,
ఆదరాబాదరాగా అన్నీకావాలంటూఅడుసులో కాలువేసే ,,
ఈ అసహన యాత్రలో,,!!!,
మనోనేత్ర గోచరం గమ్యం,వాయువేగాన్వితం మనసు,
వాహకమైన దేహం,ప్రకృతి శక్తులవశం,
జయించలేని మనోనిగ్రహం,ఓడింది,ప్రతి,పరీక్షలో,,
ఎదురయ్యే పర్వత పంక్తుల్ని,అధివహించక తప్పదు,
దారిలోని సప్తసముద్రాలు దాటక తప్పదు,
చేసిన నేరాలన్నీ ముళ్ళుగా గుచుకుంటున్నా,
పశ్చాత్తాపంతో,శక్తి పున్జుకోక తప్పదు,
ఒకదానికొకటి విరుద్దమై,ఉక్కిరిబిక్కిరి చేస్తున్న
ఈజీవనసంగ్రామ సాహసయాత్రలో,!!!!,
అడుగడుగునా ఎదురయ్యే పద్మవ్యుహ విచ్చేదనలో,
అలసి సొలసిన మనసుకు తగిలిన
గాయాలనే గేయాలుగా పాడుతూ,
సాగే ఈ రాగస్రవంతిలో,!!!
చల్లని మలయమారుతంలా  హాయి కలిగించే వారెందరో,,
మరువలేని మధురగీతంలా కనుమరుగైనా స్మ్రుతిపదంలో,
నిలచిపోయే వారెందరో,
మానవత్వపు మకరందాలతో,స్నేహసుగందాలు వెదజల్లుతూ సాగే
ఈ పయనం,నిత్య ,నవ్యజీవనయానం,!!!!!!!